నిజామాబాదు జిల్లా, A9న్యూస్.

ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్ నందు దొంగతనం జరిగి లక్ష రూపాయల వరకు వస్తువులను ఎత్తుకుపోవడం జరిగింది. ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ మెట్ పెళ్లికి చెందిన రాజేందర్ గౌడ్ లీజు కు తీసుకొని నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు పోసే దాన గ్రైండింగ్ చేసే మిషన్ సంబంధించిన 5 HP మోటార్లు రెండు, 2 HP మోటార్ ఒకటి,1HP మోటార్ ఒకటి, అదే విధంగా పౌల్ట్రీ ఆఫీస్ లో ఉన్న ఇన్వైటర్, బ్యాటరీ మరియు దీని సంబంధించిన సిస్టం బాక్స్ ను దొంగలు దొంగతనం చేయడం జరిగింది. ఈ పౌల్ట్రీ ఫామ్ నిర్వహించే వ్యక్తులు మెట్ పల్లి కి సంబంధించినటువంటి వ్యక్తులు వీరు నిన్నటి రోజు పని ముగించుకొని మెట్ పల్లి కి వెళ్లిపోయి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి చూసే వరకు కోళ్లకు దానపట్టే గది తలుపులు తెరిచి ఉండడం, పౌల్ట్రీ కార్యాలయ తలుపులు పగలగొట్టి ఉండడం దొంగతనం జరిగినట్టుగా భావించి ఏవేవి దొంగతనం జరిగాయో పరిశీలించి ఆర్మూర్లో పోలీస్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడమైనది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు పౌల్ట్రీ రైతు అభ్యర్థించడమైనది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *