నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి.

సెప్టెంబర్ 21, A9న్యూస్

నందిపేట్ మండల కేంద్రంలో గురువారం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా

ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు ,తొలి దశ తెలంగాణ ఉద్యమకారులు ,మాజీ మంత్రి వర్యులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్దన్తి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాలతో నివాళులు అర్పించటం జరిగింది

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా విడిచిపెట్టిన  కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆస్తులను లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన గొప్ప త్యాగమూర్తి అని వారు తెలిపారు. అదేవిధంగా పెద్దలు యువకులు కొండ లక్ష్మణ్ బాపూజీ ని ఆదర్శంగా తీసుకుని తన అడుగుజాడల్లో నడవాలి అంటూ వారు కోరారు,

ఈ కార్యక్రమంలో పార్టీ మండల్ అధ్యక్షులు మంద మహిపాల్ ,జిల్లా నాయకులూ వై ఎస్ గంగాధర్ ,సయ్యద్ జమీల్ ,మైనార్టీ అధ్యక్షులు షేక్ ఫరీద్ ,ఇసుబ్ ,దమ్మాయి శ్రీను ,యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు పీరాయి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *