నిజామాబాద్ A9 న్యూస్:

బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో పీసీసీ ఆదేశాల మేరకు నిన్న తుక్కుగూడ సభలో సోనియా గాంధీ, ప్రకటించిన ఆరు స్కిములను ఇంటింటి కి ప్రచారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ ఏఐసిసి ఇచార్జ్ కర్ణాటక ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కిసాన్ కెత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి,

మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ అద్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, బీసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ విభాగాల అద్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టి శ్రేణులు తదితరులు పాల్గోన్నారు.

కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్:

 

1.మహాలక్ష్మి:

మహిళలకు ప్రతీ నెల 2500

గ్యాస్ సిలిండర్ 500

ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం.

2. రైతు భరోసా:

15000 పెట్టుబడి సాయం,

కౌలు రైతులకు వర్తింపు.

12000 రైతు కూలీలకు సాయం.

వరి పంటకు 500 బోనస్

3. గృహజ్యోతి:

ప్రతీ ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్

4. ఇందిరమ్మ ఇళ్లు:

ఇళ్ళు లేని వారికి ఇంటి స్థలం,5 లక్షలు.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం.

5. యువ వికాసం:

విద్యార్థులకు 5 లక్షల విద్యా బరోసా కార్డు.

ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్

6.చేయూత:

4000 నెలవారి పింఛను

10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *