నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇంజనీర్స్ డే ను ఆర్మూర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

 

 అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. నేటితరం ఇంజనీర్లకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంతో మార్గదర్శకమని కొనియాడారు.ఆర్మూర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఇంజనీర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *