నిజామాబాద్ A9 న్యూస్: 

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఫతేపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పేకాట స్థావర బృందం పై దాడిచేసి 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని సోమవారం అరెస్టు చేశారు.

పేకాట ఆడుతున్న సదరు వ్యక్తుల నుంచి పేకముక్కలను, 8 సెల్ ఫోన్ లను, 26 వేల 900 రూపాయలను స్వాధీనం చేసుకొని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ కు అప్పగించారు. పేకాట స్థావరం పై దాడిలో పట్టుబడ్డ ఎనిమిది మంది పేకాట రాయుళ్ల పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని ఆర్మూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో పేకాట నిర్వాహకుల పై చర్యలు తీసుకోవడంలో ఆర్మూర్ ప్రాంత పోలీసులు చూసిచూడనట్లుగా వ్యవహరించడం వల్లనే యదేచ్చగా ఆర్మూర్ ప్రాంతంలో పేకాట స్థావరాలను పేకాట నిర్వాహకులు కొనసాగిస్తున్నారని పలువురు ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *