నిజామాబాద్ A9 న్యూస్:

నందిపేట్ మండల కేంద్రంలో 163వ బూతులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కెసిఆర్ గడప గడపకు జీవన్ రెడ్డి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపగడపకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిపాలన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ పరిపాలన బెరీజువేస్తూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిన విధానాన్ని ప్రజలకు వివరించారు.

రైతులకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి ని 60 వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, 163 బూతు నాయకులు నాగ శివ, ఉమ్మడ అశోక్, ఎద్దిగారి దినేష్, చుక్కబట్ల దీపక్, మచ్చర్ల సతీష్,నరేష్, నందిపేట్ మండల యూత్ నాయకులు దర్వాడి అశోక్, గంధం రాజశేఖర్, వార్డు మెంబర్లు గంధం సాయిలు, తలవేద రాజేందర్, రవి, శేఖర్, రాజు, గణేష్, నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *