నిజామాబాద్ A9 న్యూస్:

 ఆర్మూర్ పట్టణ శాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాఖీ పౌర్ణమి శుభసందర్భంగా ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని వంటగ్యాస్ ధరలపై 200 రూపాయలు అదేవిధంగా ఉజ్వల యోజన స్కీం కింద సిలిండర్లు పొందిన వారికి 400 ల మెర తగ్గించడాన్ని అదేవిధంగా పెట్రోల్ ధరలను సైతం ఐదు రూపాయల వరకు తగ్గించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు.

 

 

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు తదితరులు పాల్గొన్నా

రు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *