నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ కండెరాయుడు మల్లన్న గుడి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ప్రారంభోత్సవం జరిగింది. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్టాపించారు. బుధవారం ఇందిరమ్మ కాలనీ నుండి మల్లయ్య మందిరం వరకు విగ్రహాలు ఊరేగింపు నిర్వహించి గురువారం విగ్రహాలు ప్రతిష్టాపించారు వేద పండితులతో ప్రత్యేక పూజలు, యజ్ఞం మరియు స్వామి వారి మంగళ స్నానం, కల్యాణోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విడిసి సభ్యులు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు శాలువలతో సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్నదానం స్వీకరించారుగత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి నెల పౌర్ణమి రోజున మల్లన్న గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ శుభకార్యం లో వీడిసి సభ్యులు గ్రామ ప్రజలు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *