నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ప్రకటించబడిన శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి కి నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రెండువేల కార్లు, వెయ్యి బైకులతో ఘన స్వాగతం పలకనున్నారు.

ఆర్మూర్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం చిన్నరెడ్డి మాట్లాడుతూ ఇట్టి ఈ కార్యక్రమం 25వ తేది శుక్రవారం, ఉదయం 9 గంటలకు ఆర్మూర్ శివారులోని పెర్కిట్ బైపాస్ బ్రిడ్జి నుండి అంకాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వరకు ఇట్టి ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు.

ఇట్టి ఈ కార్యక్రమం ర్యాలీకి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *