నిజామాబాద్ A9 న్యూస్:

నందిపేట్ మండలం బీఆర్ఎస్ శ్రేణులకు మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ పిలుపు మేరకు. మంగళవారం నందిపేట్ పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు పాల్గొని…. ఈనెల 25వ తేదీన మూడోసారి ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నియమింపబడి… మొదటిసారిగా

ఆర్మూర్ కు వస్తున్న జీవన్ రెడ్డి కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని…. నందిపేట్ మండలం నుంచి 500 కార్లు వెయ్యి మోటార్ సైకిల్ తో ప్రజా ఆశీర్వాద ర్యాలీ విజయవంతం చేయాలని… మండలంలోని పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, లిఫ్ట్ చైర్మన్లు, రైతుబంధు సమితి నాయకులు, ప్రజాప్రతినిధులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉదయం 9 గంటలకు పెరికిట్ చౌరస్తాకు చేరుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *