నిజామాబాద్ A9 న్యూస్:

ఇందల్వాయి మండలంలోని అంబరాలాంటిన సంబరాలు మూడోసారి బాజిరెడ్డి గోవర్ధన్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో సంతోషంతో బిఆర్ఎస్ నాయకులు ఎగిరి గంతులు వేసి మా బాజిరెడ్డి గోవర్ధన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందించే బాధ్యత మాదేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పాశంకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసే గడిచిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ నీ గెలిపించుకుంటామని అన్నారు.

ఆయనను మంత్రిగా చూడాలని ఆశ నెరవేర్చ వరకు మేము వదిలిపెట్టలేమని అన్నారు. అనంతరం మండల అధ్యక్షులు దాస్ మాట్లాడుతూ ప్రజల పట్ల చేసిన మేలు ప్రజలు మర్చిపోరని ఆయన ప్రజలను గుండెల్లో దాచుకునే విధంగా ప్రజలు కూడా దాచుకుంటారని అన్నారు. అనంతరం రమేష్ నాయక్ మాట్లాడుతూ రైతుల గుండెల్లో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎవరు తీసివేయరని ఆయనను అత్యధిక మెజార్టీతో గెలుపొందించే బాధ్యత మా రైతులదేనని ఆయన అన్నారు.

రూరల్ లో బాజిరెడ్డి గోవర్ధన్ టైగర్ గా మీ ముందుకు వస్తాడని అని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి పార్టీల వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకుందని గుర్తు చేశారు, ప్రజలంటేనే గోవర్ధన్, గోవర్ధన్ అంటేనే ప్రజలు అనే నినాదం మర్చిపోవద్దని, 50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందించుకునే బాధ్యత మాదేనని ఆయనను మంత్రిగా చూస్తే బాధ్యత కూడా ఈ రూరల్ ప్రజలదేనని ఆయన వ్యాపాయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు మండల అధ్యక్షులు దాస్, ఎంపీటీసీ దాస్, అశ్విని, శ్రీనివాస్, ప్రవీణ్, రఘు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *