నిజామాబాద్ A9 news

ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన కాసుల సవిత, వివాహిత అనుమాన స్పదంగ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి పోలిస్టేషన్ పరిథిలో చోటుచేసుకొంది ఇందల్వాయి, ఎస్సై మహేష్ తెలిపినా వివరాలు ఇలా వున్నాయి గన్నారం గ్రామానికి చెందిన కాసుల సవిత 2008లో.గన్నారం గ్రామానికి చెందిన.కాసుల నాగేష్ తో వివాహం అయినట్లు తెలిపారు.

వీరికి ముగ్గురు ఆడపిల్లలు తెలిపారు భర్త నాగేష్, బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి నాట్లు తెలిసిందన్నారు. ఇంట్లో ఎవరు లేని సమయన్న ఉరిపెట్టుకొని మృతి చెందడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అనుమాన స్పదంగ మృతి చెందిన, సవిత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఇచిన పిర్యాదుతో కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *