నిజామాబాద్ A9 news

ప్రభుత్వ వైద్య,ఆరోగ్యశాఖ రాష్ట్ర చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర చైర్మన్ గా ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చేయుత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఏంజే, ఆసుపత్రి అధినేత డాక్టర్ బి. మధు శేఖర్ నియామకం అయ్యారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆశన్నగారి జీవన్ రెడ్డి తో కలిసి సీఎం కేసీఆర్ నీ వారి సగృహంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలు వారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *