నిజామాబాద్ A9 news

* ఆరే కటికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

 

* ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో బుస్సాపూర్ శంకర్

రాష్ట్ర ప్రభుత్వం ఆరే కటిక కులానికి తగిన గుర్తింపు ఇస్తూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు బుస్సాపూర్ శంకర్ డిమాండ్ చేశారు.

ఇందిరా పార్కు వద్ద ఆరేకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కుల వృత్తినే నమ్ముకున్న ఆరే కటిక కుల బంధువులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి అదుకోవలన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికలలో బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొవాలన్నారు.

ఈ ధర్నా కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన ఈటల రాజేందర్ కి ధన్యవాదాలు తెలిపి , ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించిన ఆరే కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భుంపలి అశోక్ కి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *