A9 news,Apr 08, 2025,
దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన సర్వేలో రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని, వారికి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయం, సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అద్యక్షతన డెహ్రాడూన్లో చింతన్ శివర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.