రాజన్న జిల్లా: ఏప్రిల్ 07

రాజన్నను వరుడుగా భావించి వివాహమాడడం వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవా యితీ ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఈ కళ్యాణ మహోత్సవా నికి హాజరైన హిజ్రాలు జోగినీలు శివుడిని వరుడుగా భావించి వివాహం చేసుకుంటారు. మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ సంతోషంగా గడుపుతారు రాష్ట్రంలోని వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే తంతు….

ప్రతి ఏట శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణంలో శివపార్వతు లు జోగినిలు హిజ్రాల్లో పాల్గొంటారు వీరంతా సాంప్రదాయబద్ధంగా పట్టు చీరలు,ఆభరణాలు ధరించి స్త్రీల కంటే అందంగా ముస్తాబై కల్యాణానికి హాజరవుతారు.

తమకు తాము శ్రీ రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహం బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం చేతిలో త్రిశూలం మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం.. రాజన్న ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మవివాహంగా పరిగణిస్తారు..

ఈ వేడుకలు అనంతరము శివపార్వతులు జోగిని లో హిజ్రాలు సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలన్నదే దీనికి సంకేతం..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *