హైదరాబాద్: ఏప్రిల్ 01
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్డ్రా ఆటో మేటిక్ సెటిల్మెంట్ లిమిట్ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను ఆలస్యం లేకుండా సులభంగా పొందవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 7.5 కోట్ల మంది సభ్యులకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటి ల్మెంట్ల ఏ ఎస్ సీ పరిమితిని పెంచాలని నిర్ణయించింది.
గత వారమే శ్రీనగర్లో జరిగిన EPFO ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా ఈ ప్రతిపా దనను ఆమోదించారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి తుది ఆమోదం పొందాల్సి ఉంది.
ఇప్పుడు PF అడ్వాన్స్ క్లెయిమ్ (ASAC) పరిమితి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. అంటే.. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇప్పు డు 3 నుంచి 4 రోజుల్లో జరుగుతుంది. గతంలో 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు, వివాహం, విద్య, ఇల్లు కొనడానికి కూడా ఆటో-క్లెయిమ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే, గతంలో ఆటో- క్లెయిమ్ అనారోగ్యం, ఆస్ప త్రి ఖర్చులకు మాత్రమే అందుబాటులో ఉండేది.
*EPFO ఖాతాదారులకు ప్రయోజనాలివే*
ఈపీఎఫ్ఓ ప్రకారం.. 95 శాతం క్లెయిమ్లు ఇప్పుడు ఆటో-ప్రాసెస్ అవుతాయి. కోట్లాది మంది ఉద్యోగులకు వెంటనే పీఎఫ్ డబ్బు చేతికి అందుతుంది. పేపర్ వర్క్ ఉండదు. గతంలో 27 దశల్లో ఉండేవి. కానీ, ఇప్పుడు 18 మాత్రమే ఉన్నాయి. త్వరలో 6 దశలు మాత్రమే మిగిలి ఉంటాయి.
అతి త్వరలో PF డబ్బు లను UPI, ATM ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రకారం.. ఈ సదుపాయాన్ని మే-జూన్ నాటికి అమలు చేయవ చ్చు.ఈ బెనిఫిట్ ఎప్పుడు లభిస్తుందంటే? ఎంప్లా యీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి ఆమోదం పొందిన వెంటనే ఈ సౌకర్యం అందుబాటు లోకి రానుంది.
ఆ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ను సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. గత వారమే కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖ NPCI సిఫార్సును ఆమోదించిందన్నారు.