*2024-25లో కంటే అదనంగా రూ.7 పెంచిన కేంద్రం.. ఏప్రిల్ 1నుంచి అమలు*
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస వేతనం రూ.307గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 సంవత్సరం కంటే రూ.7 అదనంగా పెంచింది. రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి పెంచిన కొత్త వేతనం అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉపాధి పథకంలో కూలీలకు కేంద్రం ఏటా కనీస వేతనం రాష్ట్రాల వారీగా ప్రకటిస్తుంది. ఈ మొత్తాన్ని చేరుకునే కూలీల సంఖ్య వేళ్లపై లెక్కించే పరిస్థితి. 2024-25లో కనీస వేతనం 300గా ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివ
రకు సగటున రూ.260గా ఉంది.