కరీంనగర్ జిల్లా: మార్చి 23
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు
కాగా ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళ కానిస్టేబుల్ పద్మజను ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ బైక్ తో ఢీకొట్టాడు ఈ ఘటనలో ఆమె కాలు విరగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. చికిత్సకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని, ఆయన హామీ ఇచ్చారు ఆమె ఆరోగ్య పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట బిఆర్ఎస్ నేతలు వినోద్, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.