హైదరాబాద్ A9 news

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు.

 

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న మెదక్‌ జిల్లాలో పర్యటిస్తారు.

ఈ సందర్భంగా మెదక్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌తోపాటు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

 

అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు,

20న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో సూర్యాపేట కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

 

అనంతరం నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి సైతం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *