నిజామాబాద్ A9 news

జండా బాలాజీ జాతర జండా బట్టను సర్వసమాజ్ కు అందజేసిన ఆర్మూర్ పట్టణానికి చెందిన పోహార్ భరత్ రాజ్ కుటుంబ సభ్యులు, శనివారం వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ప్రజా ఐక్య సర్వ సమాజ్ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో జెండా బాలాజీ జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు జెండా పంతులు తెలిపారు.

ఈ సందర్భంగా సర్వ సమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ తరతరాల నుంచి ఆనవాయితి గా వస్తున్న ఈ జెండా జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జెండా బాలాజీ జాతర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా సర్వసమాజ్ కు జెండా బట్టను భక్తులు అందించడం జరిగిందని అన్నారు.

ఈనెల 19వ తేదీ నుంచి జెండా జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని అన్నారు. జెండా జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. సర్వ సమాజ్ కార్యదర్శి దినేష్, ఉపాధ్యక్షులు రవీందర్, సంయుక్త కార్యదర్శి రవి, చక్రి, ప్రజా ఐక్య సర్వ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *