నిజామాబాద్ A9 news

ఎస్ఐ పోస్ట్ కు ఎంపికైన పూజను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ పోస్టుల ఫలితాలలో ఇస్సాపల్లి గ్రామానికి చెందిన సట్లపల్లి పూజ ఎస్సై పోస్ట్ కు ఎంపిక అవడం గ్రామానికి, ఆర్మూర్ ప్రాంతానికి నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం అన్నారు.

ఆమెను కన్నా తల్లిదండ్రులు సట్లపల్లి నడిపి ముత్తన్న సాయమ్మ కు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుమార్తె ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ టీపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విట్టేం జీవన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చేపూర్ చిన్నా రెడ్డి, డిసీసీ సెక్రెటరీ మాజిద్ భాయ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *