హైదరాబాద్:ఫిబ్రవరి 10
తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ… నల్లగొండ- ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగుస్తుండడంతో…
ఇప్పటివరకు 85 నామినే షన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నేడు గడువు ఆఖరు కావడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
అటు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.