మెదక్ జిల్లా: జనవరి 31

మెదక్ జిల్లా నర్సింగ్ మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏళ్ల చిరుత మృత్యువాత పడింది.చిరుతపులి. నడిరోడ్డుపై తీవ్రగాయాలతో అవస్థ పడుతున్న దాన్ని చూసేందుకు జనం పెద్ద గుమ్మిగూడారు.

 

అయితే గాయపడ్డ పులి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. తీవ్రంగా గాయపడి ఎక్కువగా నడవ లేని పరిస్థితిల్లో ఉన్నప్ప టికీ.. తనకు దగ్గరకు వచ్చే వారిపై పంజా విసిరేందుకు ఏ మాత్రం వెనకాడలేదు ఆ చిరుత.

 

అలా ఎంతోసేపు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే విల్లవిల్లాడిపోయింది. అలా తీవ్రగాయాలతో మృత్యువు తో పోరాడి చనిపోయింది.. మగ చిరుత గురువారం రాత్రి 7:30 గంటల ప్రాంతం లో అటవీ ప్రాంతం నుంచి 44వ జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే రహదారి వెంట వస్తున్న వాహనాల పైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొద్దిసేపు ప్రాణాలు నిలబెట్టుకు నేందుకు పోరాడిన చిరుత.. చివరకు విగతజీవిగా మారింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *