Jan 21, 2025,
టెట్కు 74 శాతం మంది హాజరు
తెలంగాణలో జనవరి 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు సోమవారంతో ముగిశాయి. పేపర్-1,2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,05,278 మంది (74.44 శాతం) హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ ఛైర్మన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 24న కీ విడుదల చేస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే 27న సాయంత్రం 5 గంటలవరకు ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించవచ్చని ఆయన సూచించారు.