హైదరాబాద్ జనవరి 10

పని ఒత్తిడిని తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవంతపు మరణానికి పాల్పడింది, ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది, తెలిసిన వివరాల ప్రకారం…

 

ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురా నికి చెందిన కోట సత్య లావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఐటీ ఉద్యోగి. వృత్తి రిత్యా సత్యలావణ్య బ్యాంకు ఉద్యోగి కావడంతో హైదరా బాద్‌లోని బాచుపల్లి కేఆర్‌సీఆర్‌ కాలనీలోని ఎంఎన్‌ రెసిడెన్సీలో ఈ దంపతులు కాపురం ఉంటున్నారు.

 

సత్య లావణ్య బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుంది. బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు తరచూ బంధుమిత్రుల వద్ద బాధపడుతూ.. ఉండేదట ఈ క్రమంలో సంక్రాంతికి శుక్రవారం సొంతూరుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారు.

 

అయితే గురువారం యథా విథిగా బ్యాంకు వెళ్లిన సత్యలావణ్య.. అదే రోజు మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదుగానీ నేరుగా అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పైకి వెళ్లి కిందకు దూకేసి, ఆత్మహత్యకు పాల్పడింది.

 

తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి తరలించగా.. కొంతసేపటికే ఆమె మృతి చెందింది.సత్య లావణ్య పనిచేస్తున్న బ్యాంకులో పెరిగిన ఒత్తిడి గురించి పలు సందర్భాలలో తనతో చెప్పిందని ఆమె మామ ప్రసాద్ పోలీసులకు తెలిపారు.

 

ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *