A9 న్యూస్ ప్రతినిధి:
ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు రంగురంగు బంతిపూలతో అందంగా షిడి ( రథం ) ను డప్పు, కుర్మా డోలు, వాయిద్యాలతో, భక్తుల మధ్య గుడి చుట్టూ 17 ప్రదక్షిణలు చేశారు. జాతర సందర్భంగా ఆర్మూర్ నియోజవర్గ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులుసన్మానించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వీడిసి అధ్యక్షులు బార్ల ముత్యంతెలియజేశారు.ఈ కార్యక్రమం లో వీడీసీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.