హైదరాబాద్:డిసెంబర్ 14
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి మంజీరా బ్యారక్లో ఉన్నారు. ఆయన కోసం జైలు సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
నిన్న రాత్రి వరకు అల్లు అరవింద్ జైలు వద్ద చాాలా సేపు వేచి చూశారు. విడుద లలో జాప్యం జరగటంతో… జైలు వద్ద నుంచి అల్లు అరవింద్ వెళ్లిపోయారు. నిన్న రాత్రి వరకు అల్లు అర్జున్ అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు.
తమ అభిమాన హీరోకి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే విడుదల కుదరక పోవటంతో నిరాశతో వెనుదిరిగారు.అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో ఆయన అభిమానులు చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు.
ఈ క్రమంలో జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా అభిమానుల సందడి ఉంది. దీంతో అక్కడ కూడా పోలీసులు… భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా తీర్పు రావటంతో… అప్పటికే అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
బెయిల్ మంజూరు పత్రాలు సమర్పించే విషయంలో ఆలస్యమైంది. లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగా లేకపోవటం కూడా విడుదలకు ఆలస్యమైంది. దీంతో శుక్రవారం రాత్రి అంతా కూడా ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఉదయమే విడుదల చేశారు.