A9NEWS

 

ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టికి చేపూర్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ సమస్యలు బిజెపి సీనియర్ నాయకులు కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో చేపూర్ మాజీ ఎంపీటీసీ బాల్ నర్సయ్య మరియు చేపూరు గ్రామ అభివృద్ధి కమిటీ , క్యాషియర్ S. రుక్మాజీ లు కలిసి చేపూరు హై స్కూల్ పై కప్పుతో పాటు ఒక కొత్త రూమ్ నిర్మాణం మరియు ప్రైమరీ స్కూల్ కు ప్రహరీ గోడ నిర్మాణాల కొరకు విన్నవించడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తనకు పేద వర్గాల పిల్లలు చదువుకొని స్కూల్ ల అభివృద్ధి మొదటి ప్రాధాన్యత కాబట్టి త్వరలో దానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వగృహం అంకాపూర్ లో కలిసిన కోటపాటి బృందం ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు .

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *