A9 న్యూస్ ప్రతినిధి బోధన్:

గ్యాస్ సిలిండర్ పేలి సాలూర గ్రామంలో ఓ ఇల్లు దహనమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు అంటుకున్నాయి. భారీగా అగ్ని జ్వాలలు ఎగిసిపడడంతో సిలిండర్ పేలింది. అంతకు ముందే ఇంట్లో ఉన్న ముగ్గురు అప్రమత్తమై బయటకు వచ్చారు. కానీ మంటలు భారీగా వ్యాపించడంతో బయటకు వచ్చేలోపే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఇల్లు పూర్తిగా దహనమైంది.

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *