A9 న్యూస్ వరంగల్ ప్రతినిధి:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతి లభించింది. గతేడాది నర్సంపేట, ములుగు పట్టణాలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపింది. ఈ మేరకు ఆ రెండు కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు దక్కినట్లు తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగుతున్నాయి.