A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:

నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుని సన్మానించిన ఆర్మూర్ న్యాయవాదులు ఇటీవల నిజామాబాద్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ను నేడు బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నరసయ్య బృందం శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయవాదులు అందరు సమిష్టిగా సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పోడేటి శంకర్, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి అరుణ్, కోశాధికారి తుమ్మ సురేష్, సంయుక్త కార్యదర్శి సింధుకర్ చరణ్, సుర సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *