నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ కాలనీ కి చెందిన గుమ్మడి జయరాజ్ కుమార్ ఎన్నారై (బాబి) గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 27 సంవత్సరాలుగా గల్ఫ్ దేశమైన దుబాయ్ లో కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంలో నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చారు. ప్రతి ఐదు సంవత్సరాలకు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జయరాజ్ మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ పట్టణంలో ఓటు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓటు వేయడమే కాకుండా తోటి స్నేహితులతో కలిసి అవకాశం కూడా లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. జయ రాజ్ కుమార్ అన్నయ్య ప్రభు కిరణ్ కుమార్ (లల్లు) ప్రస్తుతం సీఎస్ఐ మెదక్ డయాసిస్ లే సెక్రటరీగా ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *