నిజామాబాద్ A9 న్యూస్:

.                            మధుప్రియ 

.                           తంగెలపల్లి లక్ష్మి

బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తోపారం మధుప్రియ (24), తంగెలపల్లి లక్ష్మి (43) డెంగీతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన వీరు రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా కేంద్రం లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాల్కొండను వణికిస్తున్న డెంగీ..

 

డెంగీ జ్వరం మండల కేంద్రాన్ని వణికిస్తుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 20 మంది మండల కేంద్ర వాసులు చికిత్సపొందుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రంలో సుమారు వంద మంది డెంగీతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికా రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *