నిజామాబాద్ A9 న్యూస్:

నమస్తే నందిపేట్ కార్యక్రమంలో భాగంగా నందిపేట్ పట్టణానికి 30 కోట్ల నిధులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది. దానిలో భాగంగా నందిపేట్ పట్టణ నాయకపోడు సంఘానికి, ఒకటో పంతకు ఐదు లక్షలు రెండవ పంతకు ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయగా, నాయకపోడ్ సభ్యులు కుల సంఘ భవన భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది.

పనులు పూర్తి చేసిన వెంటనే మరొక ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ద్వారా మంజూరు చేయిస్తామని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఉప సర్పంచ్ భరత్, వార్డు మెంబర్లు భూమేష్ శంకర్, మన్నెసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయక్ కోడ్ కుల సంఘ అధ్యక్షులు శ్రీను, రాజు,శంకర్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *