హైదరాబాద్:ఏప్రిల్ 16
తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి, సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానా కి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తుందని సమాచారం.
ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతా ల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి.
ఈ దర్యాప్తులో సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధానంగా విచారణ ఎదురుకోనున్నా రు.సురానా గ్రూపు చెన్నై లోని ప్రముఖ బ్యాంకు నుం చి వేల కోట్ల రూపాయల రుణాలను పొందినట్లు సమాచారం.
అయితే, ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదివరకే సురానా గ్రూపుపై సీబీఐ కేసు కూడా నమోదు అయింది. ఇక సురానా గ్రూపుకు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ సంస్థపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో, ఈడీ సోదాలు అక్కడి కార్యాలయాల్లోను కొనసాగుతున్నాయి.
ఈ రెండు సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రుణ వినియోగంపై లోతుగా పరిశీలన జరుపుతోంది ఈడి. ఈ సోదాల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది.