యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు.

Paytm, ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay) డిజిటల్ పేమెంట్ యాప్‌లు పనిచేయడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యూపీఐ చెల్లింపులలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం 12 గంటల సమయానికి సమస్య మరింత పెరిగింది. ఆ సమయంలో ఏకంగా 1200 మంది యూపీఐ చెల్లింపులపై రిపోర్ట్ చేశారు. 66 శాతం యూజర్లకు పేమెంట్ చేసే సమయంలో సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు.

మరో 34 శాతం మంది యూజర్లకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ కావడం లేదని రిపోర్ట్ చేశారు. ఇటీవల మార్చి నెలాఖరులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న యూపీఐ వినియోగదారుల టెక్నికల్ ప్రాబ్లమ్ తో పేమెంట్స్ చేయలేకపోయారని తెలిసిందే.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *