Oplus_131072

 

A9 news,జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 11:

ఎసిబి అధికారుల దాడుల తో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగులు హడాలెత్తి పోయారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరరీ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రఘు 7000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తనకు ట్రెజరీ తరపున మంజూరైన డబ్బుల లావాదేవీల్లో ప్రతిఫలంగా ఉద్యోగి లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రఘును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *