హైదరాబాద్:జనవరి 16

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉదయం పదిన్నరకు ఆయన ఈడీ కార్యాల యానికి చేరుకున్నారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయణ్ని ప్రశ్నించారు.

 

హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ-రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్స్కు నగదు బదిలీ చేయడంలో ఫెమా, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాం డరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోణంలో కేటీఆర్ నుంచి అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.

 

విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ఆయణ్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు.

 

ఫార్ములా-ఈరేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత :మరోవైపు కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయా నికి పెద్దసంఖ్యలో బీఆర్ ఎస్ శ్రేణులు చేరుకున్నారు.

 

వారిని పోలీసులు అడ్డుకో వడంతో తోపులాట చోటు చేసుకుంది. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్పవా యువు, వాటర్‌కెనాన్ల వాహనాలను పోలీసులు తెప్పించారు. ఈ క్రమంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిం చారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *