పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి 21వ విడతను విడుదల చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నవంబర్ మొదటి వారంలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. e-KYC పూర్తి చేసుకుని, ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన వారికే డబ్బులు జమ కానున్నాయి….








