పెర్కిట్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ….

On: Sunday, June 21, 2026 11:25 AM

 

పెర్కిట్,:

ఆదివారం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెర్కిట్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మద్దికుంట శ్రీనివాస్ గారు విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ పెరిగి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలను ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

19 Jul 2026

Leave a Comment