నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ నగరంలోనీ సిపిఐ(ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ శివ కుమార్ పార్టీ శ్రేణులతో సైకిల్ పై ఎన్ ఆర్ భవన్ నుండి మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీ తో వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది.  

 ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, నిజామాబాద్ జిల్లా నాయకులు, వేల్పూర్ భూమయ్య లు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పై పోరాడే వారిని అసెంబ్లీకి పంపాలని నిజామాబాద్ నగర ప్రజలను కోరారు. పేదల ఇళ్ల స్థలాల సమస్యపై, తాగునీటి సమస్యపై, డబుల్ బెడ్ రూమ్ లకై, ఉద్యోగాల భర్తీకై, హాస్పిటల్ సమస్యలపై, కార్మికుల ఉపాధి భద్రతకై,నగరంలో మహిళ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని, నగరంలో రోడ్లు బాగు చేయాలని ఆందోళన చేసిన చరిత్ర పార్టీకి ఉందని వారు అన్నారు. డబ్బు, మద్యం, ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి మళ్లీ ప్రజల్ని మోసగించే కుట్ర బిఆర్ఎస్ ,బిజెపి, కాంగ్రెస్ చేస్తున్నాయని వారు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చి కెసిఆర్ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడారని వారన్నారు. బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యత దెబ్బతిస్తుందని వారు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని దాసు, భూమయ్య కోరారు.

ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ అభ్యర్థి శివకుమార్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా నాయకులు బి సూర్య, శివాజీ, పరుచూరి శ్రీధర్, ఎండి కాజా మొయినుద్దీన్, నీలం సాయిబాబా, బి భూమన్న, గౌతమ్, కూమనపల్లి భూమన్న, దేశెట్టి సాయి రెడ్డి, జేల్లా మురళి, వనమాల సత్యం, గంట్యాల రమేష్, జేపీ గంగాధర్, జన్నారపు రాజేశ్వర్, పోశెట్టి, బండమీది నరసయ్య, అగ్గు ఎర్రన్న, కారల్ మార్క్స్, గోపాల్, అనిత, భారతి, కృష్ణగౌడ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *