నిజామాబాద్ A9 న్యూస్: 

ఆర్మూర్ ప్రాంతములో గతములో ఎన్నడూ లేనివిధంగా, అత్యధిక మొత్తములో సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేస్తున్న ఘనత ఎమ్మెల్యే జీవన్ రెడ్డిదే. ఆర్మూర్ పట్టణం వడ్డెర కాలోనిలో నివసించే సుమన్, నవ్య సంతోష్ నగర్ కు ముజీబ్ లు ఇటీవల అనారోగ్యము వల్ల అసుపత్రిలలో చికిత్స కోసం అయిన బిల్లులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి సుమన్ కు 12,000/- రూపాయలు, నవ్యకు 10,000/- రూపాయలు, ముజీబ్ కు 18,000/- రూపాయలు మంజూరు చేయించగా, బుధవారం చెక్ లను లబ్దిదారులకు అందచేయడం జరిగింది.

చెక్కులు తీసుకున్న బాధిత కుటుంభ సభ్యులు జీవన్ రెడ్డికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భముగా మున్సిపల్ కౌన్సిలర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ ఎవరికీ ఏ ఆపద వచ్చినా మేమున్నాం అని భరోసా ఇస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసే మేలు పేద ప్రజలకు కొండంత అండ లభిస్తుందని అని అన్నారు.

ఈ కార్యక్రమములో బిఆర్ఎస్ నాయకులు ఖాందేష్ సత్యం, జాగృతి నియోజక వర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్, భాండారి నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *