మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

On: Saturday, June 28, 2025 4:22 AM

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి ఆర్ఎస్ నాయకులు

బి ఆర్ ఎస్ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి, దళిత ప్రజా ప్రతినిధి చిన్నోళ్లభాస్కర్—–

ఎ9 న్యూస్ మాసాయిపేట మెదక్ జూన్ 22:

మెదక్ జిల్లా ఉమ్మడి చేగుంట, మాసాయిపేట మండలం పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లి శివారులోని పులిగుట్ట తండాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ చారి ఆధ్వర్యంలో కరంటోత్ రౌవుజ్య మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను మృతుని సతీమణి పురన్ ను, కుమారులు నరసింహ, బిక్షపతిలను పరామర్శించినట్లు టిఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ చారి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఎల్లవేళలా ముందుండి ఎలాంటి అవసరతలు ఉన్న తెలియజేయాలని వారిని ఓదారుస్తూ ధైర్యం చెప్పి ఆర్థిక సాయంగా 50kgల బియ్యం అందించడం జరిగిందని అన్నారు.

తాజా మాజీ సర్పంచ్ నేను మా పార్టీ తరుపున మరియు గవర్నమెంట్ ద్వారా వచ్చి పథకాలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందే విధంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నామని తెలపడం జరింగింది అని బి ఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సురేష్ చారి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ తండా గిరిజననాయకులు పెద్ద విఠల్ నాయక్ పరశురామ్ నాయక్ భాస్కర్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు లాలు నాయక్ వసురం నాయక్ టిఆర్ఎస్ యువకులు దళిత ప్రజా ప్రతినిధి చిన్నోల భాస్కర్, మరియు తదితరులు పాల్గొన్నారు

23 Jul 2025

Leave a Comment