నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడం జరిగింది.

పాఠశాల ఆవరణలో ఉట్టిని కొట్టి సాంప్రదాయ బద్దంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ముత్తు నందిపాటి మాట్లాడుతూ ధర్మం కోసం యుద్ధం చేసి అధర్మంపై ధర్మమే ఎప్పుడు విజయం సాధిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పినది శ్రీకృష్ణుడు అని ఆయన అన్నారు జీవితం లో విద్యార్థులు సన్మార్గాన్ని అవలంబించాలని, అప్పుడే ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారని ఆయన విద్యార్థులకు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రైమరీ కోఆర్డినేటర్ ప్రసన్న, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీవిద్య, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి ,లిఖిత మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *