నిజామాబాద్ A9 న్యూస్:

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోర్త రాజేంధర్ మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొనడం జరిగింది.

 

రాజేంధర్ మాట్లాడుతూ 25వేలతో కూడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఉద్యోగ కల్పన చేయాలని నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ భారస ప్రభుత్వం యువతను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగుల భర్తీ చేపడుతుందని మరియు ఆర్మూర్ యూత్ కి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఏ కేసులకు భయపడకూడదని టికెట్ ఎవరికి వచ్చిన కలిసికట్టుగా పని చేద్దామని యూత్ కి దిశ నిర్దేశం చేశారు.

 

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ ఎన్ .ఎస్. యు .ఐ ఆర్మూర్ అధ్యక్షులు బాశెట్టి శశి కుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ సుద్దపల్లి అఖిల్ నియోజవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ నవనీత్ ఆలూరు మండల అధ్యక్షులు సిరికొండ మహేష్ మాక్లూర్ ,మండల అధ్యక్షులు రాజు నందిపేట్ మండల అధ్యక్షులు నాగరాజు ,డొంకేశ్వర్ మండల అధ్యక్షులు గోపి పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *