A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పోలీసుల సమర్థవంతమైన చర్యతో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి యజమానుల చేతికి చేరాయి. శుక్రవారం రోజు ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి పోలీసులు సేకరించారు.
మొత్తం మూడు మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అప్పగించారు.
యమ్. డి. జబ్బార్, జి. భోజగౌడ్, రాకేష్
మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.








