Mar 20, 2026:
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనుంది. పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. జరిమానాలపై అభ్యంతరాలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రవాణా శాఖ నూతన విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడనుంది.








