Jan 21, 2026,
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సెక్రటరీ సీతాలక్ష్మీ తెలిపారు. రాష్ట్రంలోని 23 స్కూళ్లలో 1,380 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కేవలం ఎస్టీలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష మార్చి 29న నిర్వహించబడుతుంది.






