సర్పంచ్ అభ్యర్థి – రాజేండ్ల లావణ్య మురళి
A9 news:
కత్తెర గుర్తు
గ్రామపంచాయతీ ఎన్నికలలో చింరాజుపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా రాజేండ్ల లావణ్య మురళి కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నారు.
గ్రామాన్ని అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యం. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి మౌలిక వసతులతో పాటు విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇస్తున్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తూ, చింరాజుపల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
గ్రామాభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలని,కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చింరాజుపల్లి గ్రామ ప్రజలను రాజేండ్ల లావణ్య మురళి వినమ్రంగా కోరుతున్నారు.








