ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 21:
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి నిర్వహించారు.
ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.58,060/- నగదు మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను మరియు స్వాధీనం చేసిన వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్కు అప్పగించి, కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ:
జూదం వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని తెలిపారు.








